చైనా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరిన చంద్రబాబులో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. అక్కడ చైనాతో రకరకాల ఒప్పందాలను కుదుర్చుకున్న ఆయన షాంఘై సిటీపై తెగ ముచ్చట పడిపోతున్నారు. అక్కుడున్న పరిస్థితులే ఇక్కడా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని షాంఘై తరహాలో తయారు చేయవచ్చునని ఆయన చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే తాము పని చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు.