కార్తీక మాసం - అయ్యప్పదీక్షల ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు

శుక్రవారం, 24 నవంబరు 2023 (09:51 IST)
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. గత 20 రోజుల్లో వీటి ధరలు 22 శాతం మేరకు తగ్గాయి. దీనికి కారణం కార్తీక మాసం, అయ్యప్ప దీక్షలు. ఈ రెండింటి కారణంగా అమ్మకాలు తగ్గిపోయాయి. అంటే డిమాండ్ తగ్గిపోవడం, సరఫరా పెరగడంతో ధరలు తగ్గాయని వ్యాపారులు తెలిపారు. 
 
ఈ కారణంగా గత 20 రోజుల్లో ఏకంగా 22 శాతం మేరకు తగ్గాయి. నవంబరు 3వ తేదీన లైవ్ చికెన్ ధర కిలో రూ.140గా ఉంటే, ఇపుడు అది రూ.126కు పడిపోయింది. స్కిన్, వితౌట్ స్కిన్, బోన్‌లెస్ చెకెన్ ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. చికెన్ ధరల తగ్గుదలపై వ్యాపారులు స్పందిస్తూ, కార్తీక మాసం, అయ్యప్ప దీక్షల కారణంగా డిమాండ్ తగ్గిపోయిందని, అదేసమయంలో చికెన్ సరఫరా పెరిగిందన్నారు. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వివరించారు 
 
కాగా, గత నెల 29వ తేదీన కార్తీక మాసం ప్రారంభమైన విషయం తెల్సిందే. అప్పటి నుంచి అనేక మంది హిందూ ప్రజలు మాంసాహానికి దూరంగా ఉంటున్నారు. దీనికితోడు ఈ నెల 17వ తేదీ నుంచి అయ్యప్ప దీక్షలు ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది అయ్యప్ప దీక్షామాలను ధరించడంతో వారు కూడా మాంసాహానికి దూరంగా ఉంటున్నారు. ఈ కారణాలతోనే చికెన్ ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయని వ్యాపారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు