కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని బోదవాడ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బొదవాడకు చెందిన కామేష్ (30) ను అతని భార్య లక్ష్మి బ్లేడుతో గొంతు కోసి హత్య చేసింది. అనంతరం అక్కడి నుంచి ఆమె పరారైంది.