వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి 16 యేళ్ల కుమార్తెనిచ్చి...

మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (17:17 IST)
తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న 50 యేళ్ల వ్యక్తికి తన 16 యేళ్ల కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఓ మహిళ తీవ్రంగా ప్రయత్నం చేసింది. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు వచ్చి ఈ పెళ్లిని ఆపి, ఆ మహిళను అరెస్టు చేశారు. సిరిసిల్ల పట్టణంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్యనగర్‌కు చెందిన మణెమ్మ అనే మహిళకు భర్త చనిపోయారు. దీంతో కోనాయపల్లికి చెందిన గడ్డమీద గంగరాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈయన దుబాయ్‌లో పనిచేస్తున్న గంగరాజుకు తన కూతురు (16)ను ఇచ్చి పెళ్లి చేయాలని మణెమ్మ నిర్ణయించుకుంది. 
 
ఇందుకోసం హైదారాబాద్‌‌కు తీసుకెళ్తుండగా బాలిక కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మణెమ్మను అదుపులోకి తీసుకున్నారు. మణెమ్మ, గంగరాజు, నవీన్‌, బాలిక చిన్నమ్మలైన కళ, మాధవిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు