కామవాంఛ తీర్చమన్న భర్త.. 'దాన్ని' కోసేసిన భార్య.. ఎక్కడ?

శుక్రవారం, 21 జులై 2017 (09:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. వేకువజామున తన కోర్కె తీర్చమన్న భర్త మర్మాంగాన్ని భార్య కోసేంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంటూరు జిల్లా వేలూరులోని గుడియాత్తం కన్నియప్పన్ నగర్‌లో జగదీశన్ అనే వ్యక్తి దర్జీగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఈయనకు భార్య సరస్వతి, నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే, కామవాంఛ ఎక్కువ కలిగిన జగదీశన్.. గురువారం వేకువజామున తన కోర్కె తీర్చమని భార్యను నిద్రలేపాడు. 
 
మంచి నిద్రలో ఉన్న సరస్వతి... భర్త మర్మాంగాన్ని కోసిపారేసి ఇంటి నుంచి బయటకు పారిపోయింది. దీంతో జగదీశన్ కేకలు పెట్టడంతో స్థానికులు అక్కడికి చేరుకొని చికిత్స కోసం అతడిని స్థానిక ఆస్పత్రికి  తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి సరస్వతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి