నేడు ప్ర‌పంచ ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ దినోత్స‌వం

మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (13:55 IST)
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా గుంటూరులోని బుడంపాడు సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. స్పందనా ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో హోంమంత్రి విద్యార్థినిలకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. 
 
యువత చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయని హోంమంత్రి సుచరిత ఆవేదన వ్యక్తంచేశారు. ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే తల్లిదండ్రులకు గాని, గురువులకు గాని, స్నేహితులకు చెప్పుకోవడం వలన మానసిక ఒత్తిడి నుండి బయటపడవచ్చు అని తెలిపారు. సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం అయ్యే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని విద్యార్థినులకు సూచించారు. 
 
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళల రక్షణ విషయంలో చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. అమ్మాయిలు, మహిళల కోసం ప్రత్యేకంగా దిశ యాప్ ను రూపొందించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 46 లక్షల మంది వరకు దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. దిశ యాప్ ద్వారా రక్షణ పొందిన మహిళలు ఎంతో మంది ఉన్నారని తెలిపారు.

ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా దిశ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వీలయినంత మంది దిశ యాప్ ను ఉపయోగించుకొని రక్షణ పొందాలని హోంమంత్రి మేకతోటి సుచరిత సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు