మాండొలిన్ శ్రీనివాస్ మృతి: హృదయం చలించిందన్న ఏఆర్ రెహ్మాన్!

శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (14:45 IST)
మాండొలిన్ శ్రీనివాస్ మృతి పట్ల ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మృతి విషయం విని తన హృదయం చలించిపోయిందన్నారు. 
 
కాగా దేశం గర్వించదగ్గ సంగీత విద్వాంసులలో మాండొలిన్ శ్రీనివాస్ ఒకరంటూ పలువురు సంగీత ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. 
 
అనారోగ్యంతో బాధపడుతున్న మాండొలిన్ శ్రీనివాస్ (45) శుక్రవారం ఉదయం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. కాలేయ సమస్య కారణంగా ఆయనను కొద్దిరోజుల క్రితం అపోలో ఆస్పత్రిలో చేర్చారు. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో శ్రీనివాస్ కన్నుమూశారు.

వెబ్దునియా పై చదవండి