మొన్న గోల్ఫ్.. నిన్న చెస్.. నేడు ఫుట్‌బాల్.. ఇదీ ఇంగ్లండ్‌లో జగన్ ఆటవిడుపు (ఫోటోలు)

శనివారం, 25 జూన్ 2016 (17:32 IST)
నిత్యం ధర్నాలు, ఆందోళనలు, విమర్శలు, ప్రతివిమర్శలతో విసిగిపోయిన వైకాపా అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్. జగన్ మోహన్ రెడ్డి విశ్రాంతి కోసం తన కుటుంబ సభ్యులతో ఇంగ్లండ్ (లండన్‌)కు వెళ్లిన విషయం తెల్సిందే. అక్కడ ఆయన గడుపుతున్న మధుర క్షణాలను సోషల్ మీడియాలో ఫోటోల రూపంలో వెల్లడవుతున్నాయి. మొన్నటికి మొన్న గోల్ఫ్ ఆడుతున్నట్టు కనిపించిన జగన్.. నిన్న ప్రశాంత వదనంతో చెస్ ఆడుతూ ఫోటోలకు చిక్కారు. తాజాగా ఇద్దరు చిన్నారులతో ఫుట్‌బాల్ ఆడుతూ ఉన్నారు.
 
ముఖ్యంగా ఈ ఇంగ్లండ్ పర్యటనలో ఆయనలో ఉన్న కోణాలూ వెలుగు చూస్తున్నాయి. జగన్‌లో ఇన్ని కళలు ఉన్నాయనే విషయం తమకు ఇంతవరకు తెలియదని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ముఖ్యంగా. గోల్ఫ్, చెస్ ఆడటం తమకు అస్సలు తెలియదని చెపుతున్నారు. తాజాగా ఆయన ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించారు. ఇక మున్ముందు ఏ విధంగా కనిపిస్తారో వేచి చూడాల్సిందే. మొత్తంమీద ఇంగ్లండ్ పర్యటన ముగిసేలోపు తనలో దాగివున్న అన్ని కళలను బహిర్గతం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి