హుదూద్ బాధిత ప్రాంతాల్లో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి శనివారం పర్యటించారు. శనివారం విశాఖలోని తుమ్మపాల ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి చెరకు రైతులు జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో టీడీపీ ప్రభుత్వం సహకార రంగంపై వ్యవహరిస్తున్న తీరుపై జగన్ విమర్శలు గుప్పించారు.