దేశ వ్యాప్తంగా వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ ఫీవర్ చోటుచేసుకుంది. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా గెలుపొందాలని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
విజయపథంలో దూసుకెళ్తున్న టీమిండియా మరో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఉదయం ఆయన ట్వీట్ చేయగా, ఇప్పటివరకూ 100కు పైగా రీ ట్వీట్లు వచ్చాయి.