ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దు మొర్రో అని చెప్పినా పట్టించుకోలేదు, అందుకే ఓడాము: కాటసాని

ఐవీఆర్

ఆదివారం, 9 జూన్ 2024 (18:10 IST)
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసిపి పరాజయానికి ప్రధాన కారణమైందని ఆ పార్టీ నాయకుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు సరిగ్గా పదిరోజుల నుంచి ఈ చట్టంపై తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లిందనీ, ఆ చట్టంతో ప్రభుత్వం భూములు లాగేసుకుంటుందని చెప్పడంతో చాలామంది దాన్ని నమ్మేశారని అన్నారు.
 
తాము ప్రచారానికి వెళ్లినప్పుడు ఈ చట్టంపై ప్రజలు తమను నిలదీసారనీ, ఆ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు. ఈ చట్టాన్ని ప్రస్తుతం పక్కన పడేయాలని చెప్పినా వినలేదనీ, అందువల్ల పార్టీ ఘోరంగా ఓడిపోయిందని అన్నారు.
 
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ ఫోటో వేయడాన్ని కూడా గ్రామీణ ప్రజలు నిలదీశారని వెల్లడించారు. ఇలాంటి తప్పుల వల్ల పార్టీ పరాజయం అయ్యిందని అభిప్రాయపడ్డారు.
 

వైసీపీ ఓటమికి కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్!!

- కాటసాని pic.twitter.com/O73flBG8mi

— YSRCP Brigade (@YSRCPBrigade) June 9, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు