జగన్ అన్నయ్య.. విజయమ్మ అమ్మ... జగన్‌కు రాఖీ కట్టిన రోజా

గురువారం, 18 ఆగస్టు 2016 (13:28 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే.రోజా రాఖీ కట్టింది. రక్షా బంధన్‌ను పురస్కరించుకుని ఆమె ఈ రాఖీ కట్టింది. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంది. జగనన్నను మొట్టమొదటిసారిగా వైఎస్‌ఆర్ అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు కలిశానని గుర్తు చేశారు. అప్పటి నుంచి జగన్ తనను సొంత చెల్లిలా భావించారని... అది తన అదృష్టమని ఆమె తెలిపారు. విజయలక్ష్మిని తాను అమ్మ అని పిలుస్తానని... ఆమె కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుందని రోజా చెప్పారు. 
 
తనను ఒక పార్టీ ఎమ్మెల్యేలా కాకుండా సొంతమనిషిగా జగనన్న కుటుంబం భావించిందని ఆమె వైఎస్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. టీడీపీ కుట్ర పన్ని తనను అసెంబ్లీ నుంచి సంవత్సరం పాటు నిషేధించిన క్రమంలో కూడా జగనన్న అండగా నిలిచారని ఆమె తెలిపారు. అప్పటి నుంచి జగన్‌ను సొంత అన్న కంటే ఎక్కువగా భావిస్తున్నట్లు రోజా చెప్పారు. తనతో జగనన్న ఉన్నంత కాలం ఎవరూ ఏమీ చేయలేరని రోజా ధీమా వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి