నేలతంగేడుతో ఆయుర్వేదం.. కీళ్ళనొప్పులున్న వారు..?

గురువారం, 1 డిశెంబరు 2022 (17:30 IST)
నేలతంగేడుకు ఆయుర్వేదంలో పెద్దపీట వుంది. నేలతంగేడు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే శరీరానికి మంచి పుష్టిని, బలాన్ని ఇస్తుంది. ఆవు నెయ్యి, పంచదార, నేలతంగేడు చూర్ణం తగిన పాళ్ళలో కలుపుకుని సేవిస్తే వ్యాధినిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. ఖర్జూరపండుతో కలుపుకుని నేలతంగేడు చూర్ణంతో తీసుకుంటే అతి ఆకలిని తగ్గిస్తుంది. 
 
పాలతో కలిపి తీసుకుంటే దృష్టి వ్యాధులను నివారించి చక్కని దృష్టిని కలిగిస్తుంది. కీళ్ళనొప్పులున్న వారు నేల తంగేడు చూర్ణం పటికబెల్లంతో పాటుగా పుచ్చుకుంటే కీళ్ళనొప్పులు త్వరగా తగ్గుతాయి. 
 
శరీరానికి బలం లభిస్తుంది. పెరుగుతో పాటు ఈ చూర్ణం కలుపుకునిసేవిస్తే శరీరంపై మచ్చలు, తామర, గజ్జి వంటి వాటిని నివారిస్తుంది. అల్లం రసంతో కలిపి తీసుకుంటే కళ్లకు మంచి కాంతినిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు