మల్లెపూల టీ తాగితే కలిగే ప్రయోజనం ఏంటి? (video)

శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (22:34 IST)
బ్లాక్ టీ, జింజిర్ టీ, తేయాకు టీ, మందార ఆకుల టీ.. ఇలా రకరకాల టీల గురించి మనకు తెలుసు. ఈ టీలను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసు. ఐతే మల్లెపూలతో చేసే టీలో ఆరోగ్య రహస్యాలున్నాయంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
 
ఈ మల్లెపూల టీ తీసుకోవడం వల్ల ఉపయోగాలను చూద్దాం. రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. రక్తంలో ఎల్.డి.ఎల్. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. అందుచేత హృదయసంబంధ వ్యాధులను, పక్షవాతాన్ని రానీయదు.
 
వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. లావు తగ్గాలనుకునే వారికి ఈ టీ ఎంతో మంచిది. తొందరగా బరువు తగ్గటానికి సహాయపడుతుంది. దీనితో పుక్కిలిస్తే చిగుళ్ళ వ్యాధులు, దంతక్షయం రాకుండా కాపాడుతుంది. అల్సర్, కేన్సర్ వంటివి రాకుండా సహాయపడుతుంది. జలుబు, దగ్గు, అలర్జీల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.
 
కండరాల నొప్పులను, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. రొమాంటిక్ భావాలు పెంచుతుంది. మల్లెల నూనెను కీళ్ళ, కండరాల నెప్పులకు రాస్తే ఉపశమనం కలుగుతుంది.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు