అవకాడో పేస్టులో టీ ట్రీ ఆయిల్ కలిపి.. ముఖానికి రాసుకుంటే..?

మంగళవారం, 14 జూన్ 2016 (16:51 IST)
కలబంద గుజ్జులో రెండు టీస్పూన్ల టీ ట్రీ ఆయిల్‌ కలిపి ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మంపై మంట, దురద వంటివి తగ్గుతాయి. ఒక టీస్పూను తేనెలో రెండు చుక్కలు టీ ట్రీ ఆయిల్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసుకొని పావుగంట తరువాత చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
 
పావు టీస్పూను అవకాడో పేస్టులో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మంచి మెరిసే సౌందర్యం మీ సొంతం అవుతుంది. వారానికి ఒకసారి లేదా రెండు సార్లు పైవిధమైన చిట్కాలను పాటిస్తే.. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. 

వెబ్దునియా పై చదవండి