ఆయిలీ స్కిన్ అయితే విటమిన్ సి పుల్లటి పండ్లు అంటే నిమ్మరసం, బత్తాయి, ఆరెంజ్ పండ్లు బాగా పనిచేస్తాయి. ముఖంపై మచ్చలుంటే వాటిని తొలగించేందుకు ఒక చెంచా పసుపును పాలలోకాని లేదా నీటిలోకాని కలపి సేవించండి. దీంతో మీ ముఖంపై మచ్చలు మటాష్ అవుతాయి. బత్తాయి, నిమ్మరసాన్ని ముఖానికి పట్టిస్తే.. చర్మం మృదువుగా తయారవుతాయి.
పొడిబారిన చర్మం కలవారు అరటిపండు, తేనె, పెరుగును కలిపిన పేస్ట్ను ముఖానికి పూసి 15 నిమిషాలపాటుంచండి. చర్మం గతంలోకన్నా మెరుగ్గా తయారవుతుందని బ్యూటీషన్లు అంటున్నారు.