రైల్వే బడ్జెట్-2010-11: మమత ప్రకటించిన కొత్త రైళ్లు!
బుధవారం, 24 ఫిబ్రవరి 2010 (16:51 IST)
రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన 2010-11 వార్షిక బడ్జెట్లో పలు రైళ్ళను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా దురంతో పేరుతో ఆమె పది కొత్త రైలు సర్వీసులను నడుపనున్నట్టు తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అలాగే, కొన్ని అన్ రిజర్వుడ్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టారు. వీటిని కర్మభూమి, జన్మభూమి రైళ్లుగా పిలుస్తారు.
ఈ దురంతో రైళ్లలో కొన్ని. ముంబై-సికింద్రాబాద్, పూణే-హౌరా, జైపూర్-ముంబై, చెన్నయ్-కోయంబత్తూరు. కర్మభూమి ఎక్స్ప్రెస్ రైలు (అన్ రిజర్వుడ్), దర్భంగా-ముంబై, గౌహతి-ముంబై, న్యూ జుల్పాయ్గురి-అమృతసర్, అహ్మదాబాద్-ఉధమ్పూర్ల మధ్య జన్మభూమి ఎక్స్ప్రెస్, అలాగే, దేశంలోని 16 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కలుపుతూ 16 భారత్ తీర్థ ప్రత్యేక రైళ్ళను నడుపుతారు. ఆ వివరాలు..
భారత్ తీర్థ్ ట్రైన్స్ వివరాలు.. హౌరా-గయా-ఆగ్రా-మదురా-బృందావన్-న్యూఢిల్లీ-హరిద్వార్-వారణాసి-హౌరా