గతంలో పాకిస్థాన్, ఇరాన్ దేశాలతో కుదుర్చుకున్న గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్ ఒప్పందం నుంచి భారతదేశం వైదొలగినట్లు పాక్ వెల్లడించింది.
పాక్, ఇరాన్ దేశాలతో గతంలో కుదుర్చుకున్న గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్కు సంబంధించిన ఒప్పందం నుంచి భారతదేశం వైదొలగినట్లు పాకిస్థాన్ రాయబారి ముహమ్మద్ బక్స్ అబ్బాసీ ఇరాన్లో తెలిపినట్లు టెహ్రాన్కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఇదిలావుండగా గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్ విషయంపై ఇంకా అధికారికంగా ఖరారు చేయాల్సి ఉందని ఆ వార్తా సంస్థ పేర్కొంది.
కాగా నిరుడు భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన పేలుళ్ళ అనంతరం భారత్ ఈ ప్రాజెక్ట్పై అంతగా ఆసక్తి కనపరచలేదని, దీంతో ఒప్పందం రద్దయినట్లేనని పాక్ భావిస్తున్నట్లు సమాచారం.