నోట్ల రద్దు చూపిన ప్రభావాలపై ఎలాంటి అధ్యయనం చేయకుండా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పెద్ద నోట్ల రద్దుకు సిఫారసు చేశారని ఆరోపించారు. వివిధ దేశాల్లో నోట్ల రద్దు ఎలాంటి పరిస్థితులకు దారితీసిందో సరిగ్గా అధ్యయనం చేయలేదని, ఇది ఈ నిర్ణయం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందన్నారు.
ఆర్బీఐని అభివృద్ధి బాటన నడిపించాల్సిన ఉర్జిత్ పటేల్ ప్రభుత్వానికి, ప్రధానికి తప్పుడు సలహాలు ఇచ్చారని అన్నారు. బ్యాంకులపై ఒత్తిడి కారణంగా బ్యాంకుల్లో దొంగ నోట్లు జమ అవుతున్నాయన్నారు. 2,000 రూపాయల నోట్లు ముద్రించాల్సిన చోట వాటిని ముద్రించకుండా, బ్యాంకులకు చెడిపోయిన 100 రూపాయల నోట్లను ఆర్బీఐ విడుదల చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.