ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్లకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లోనే...?

శనివారం, 7 నవంబరు 2020 (13:41 IST)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన సబ్‌స్క్రైబర్లకు తీపికబురు అందించేందుకు రెడీ అవుతోంది. పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ తీసుకువస్తోంది. పెన్షన్ పొందే వారు ప్రతి ఏడాది లైఫ్ సర్టిఫికెట్‌ అందించాలి. ఇప్పుడు ఈపీఎఫ్‌వో ఈ లైఫ్ సర్టిఫికెట్ నిబంధనలు సరళీకరిస్తోంది. పీఎఫ్ పెన్షన్ తీసుకునే వారు ఏడాదిలో ఎప్పుడైనా జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించేందుకు ఈపీఎఫ్‌వో వెసులుబాటు కల్పించనుంది. 
 
నవంబర్ లేదా డిసెంబర్‌లో మాత్రమే చెల్లించాల్సిన అవసరం లేదు. ఏడాదిలో ఎప్పుడైనా సమర్పించొచ్చు. అంతేకాకుండా ఈపీఎఫ్‌వో.. కామన్ సర్వీస్ సెంటర్ల సీఎస్సీ సెంటర్లతో కూడా భాగస్వామ్యం కుదర్చుకుంది. దీంతో పెన్షన్ తీసుకునే వారు వారి జీవన్ ప్రమాణ్ పత్రాన్ని ఆన్‌లైన్‌లో కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి సమర్పించొచ్చు. ఇంకా పోస్టాఫీస్‌లు కూడా లైఫ్ సర్టిఫికెట్‌ను తీసుకుంటున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు