కృష్ణా పుష్కరాల్లోపే.. విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి కువైట్‌కు ఫ్లైట్ సర్వీసులు!

బుధవారం, 29 జూన్ 2016 (14:33 IST)
విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి కువైట్‌కు డైరక్ట్ ఫైట్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల చైనా వెళ్లిన సందర్భంగా ఇతిహాడ్ ఎయిర్‌వేస్ సంస్థతో జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో కువైట్‌కు చెందిన ఇతిహాడ్ ఎయిర్‌వేస్ సంస్థ త్వరలోనే తమ సేవలను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. 
 
ఇతిహాడ్ ఎయిర్‌వేస్ సంస్థతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇందుకు సంబంధిత శాఖల నుంచి అనుమతులను కూడా తీసుకోనున్నారు. అంతేగాకుండా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి కృష్ణా పుష్కరాల్లోపే ఈ సేవలను ప్రారంభించాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కృష్ణా పుష్కరాలలోపు కాకపోయినా, ఆ తర్వాతైనా ఈ ప్రాజెక్టును అమల్లోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి