టమోటా, ఉల్లి తర్వాత పెరిగిన వెల్లుల్లి ధరలు

సోమవారం, 11 డిశెంబరు 2023 (12:10 IST)
టమోటా, ఉల్లి తర్వాత ఇప్పుడు వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో వెల్లుల్లి ధర కిలో రూ.300 నుంచి రూ.350కి చేరింది. ప్రతికూల వాతావరణం వెల్లుల్లి రుచిని పాడు చేసింది. దీని కారణంగా సరఫరా తగ్గింది. 
 
ఫలితంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో వెల్లుల్లి ధరలు గత ఆరు వారాల్లో రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లలో నాణ్యమైన వెల్లుల్లి కిలో రూ.220-250 వరకు విక్రయిస్తున్నారు. సగటు హోల్‌సేల్ ధర కిలో రూ.130-140. 
 
మహారాష్ట్రలో, ముంబై నుండి హోల్‌సేల్ వ్యాపారులు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుండి వెల్లుల్లిని కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు