చెడిన భారత్-కెనడా దౌత్యబంధం.. రూ.3 లక్షల కోట్లు కెనడాకు గోవిందా!

శనివారం, 23 సెప్టెంబరు 2023 (17:39 IST)
India_Canada
భారత్-కెనడాల మధ్య బంధం చెడింది. దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. భారత్‌తో దౌత్యపరమైన వివాదం కారణంగా కెనడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. భారత సహకారంతో అనేక రంగాల్లో వ్యాపారాలు చేస్తున్న కెనడా... గట్టి దెబ్బ తగిలింది. భారతీయులు ప్రతి ఏడాది కెనడా ఆర్థిక వ్యవస్థకు రూ.3 లక్షల కోట్లు అందిస్తున్నారు. 
 
భారత్‌తో శత్రుత్వం కారణంగా కెనడా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ తగుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరించిన తరుణంలో.. 20 లక్షల మంది భారతీయులు కెనడా ఆర్థిక వ్యవస్థలో భాగమై వున్నారు. భారత్ నుంచి కెనడాకు చదువుకునేందుకు వెళ్లే రెండు లక్షల మంది విద్యార్థుల ఫీజుల నుంచి రూ.75వేల కోట్లు కెనడాకు అందుతున్నాయి. 
 
కెనడాలో ఆస్తి వ్యవహారాల్లో భారతీయులు ఎక్కువ పెట్టుబడి పెడతారు. భారతీయ కంపెనీలు 2023 నాటికి కెనడాలో 41వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాయి. 17వేల ఉద్యోగాలను సృష్టించాయి. ఇక భారత్‌తో దౌత్య వివాదం కారణంగా వీసా, ఇతర పనులు ఆలస్యం కావడంతో కెనడాకు ఆదాయం తగ్గే ఛాన్సుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు