ఆ విమానాల్లో పిచ్చపిచ్చగా ప్రయాణించేయవచ్చు... ఎలా?

శుక్రవారం, 1 డిశెంబరు 2017 (19:17 IST)
విమాన ప్రయాణం కూడా తక్కువ ధరకే చేసేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి కొన్ని విమాన సర్వీసులు. తాజాగా ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో అత్యంత తక్కువ ధరకే ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. ఆ ధరలు చూస్తుంటే ఏసీ ఫస్ట్ క్లాసు రైలు ప్రయాణ చార్జీకి అటుఇటుగా వుంటోంది. కాబట్టి ఇక ఎంచక్కా విమానం ఎక్కేయవచ్చు. ఇంతకీ ఇండిగో ప్రకటించిన రూట్లు.. ధరలు చూద్దాం.
 
టికెట్‌ ప్రారంభ ధర - రూ.1,112.
జమ్ము-శ్రీనగర్‌ టికెట్‌ ధర - రూ.1,112
కోయంబత్తూరు- చెన్నై ప్రారంభం ధర- రూ.1,195
విశాఖపట్టణం-హైదరాబాద్‌ రూ.1,259
పట్నా-కోల్‌కతా రూ.1,264
బెంగళూరు-చెన్నై రూ.1,285
 
ఐతే జనవరి రెండో వారంలో ప్రయాణానికి ఈ ధరలు అందుబాటులో ఉంటాయని తెలియజేసింది. నూతన సంవత్సరం, పండుగల దృష్ట్యా ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలియజేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు