ఉత్తరాది పుణ్యక్షేత్రాలను కలిపే తీర్థయాత్ర-ఐఆర్సీసీటీ టూరిస్ట్ రైలు ప్రకటన

సెల్వి

శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (11:52 IST)
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీసీటీ) భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రకటించింది హరిద్వార్-రుషికేశ్-వైష్ణోదేవి-అమృత్‌సర్-ఆనంద్పూర్ యాత్ర కోసం ఈ రైలు ఏప్రిల్ 23న విజయవాడ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన స్టేషన్లను కవర్ చేస్తుంది.
 
ఈ రైలు హర్-కీ-పౌరి, రామ్ జాలా, లక్ష్మణ్ జాలా, ఆనంద్ సాహిబ్ గురుద్వారా, నైనా దేవి ఆలయం, గోల్డెన్ టెంపుల్, వాఘా సరిహద్దు, మాతా వైష్ణో దేవి ఆలయం వద్ద మానసా దేవి ఆలయం, గంగా-హారతీని కవర్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని వివిధ ఎన్‌రోల్ స్టేషన్లలో బోర్డింగ్, డీ-బోర్డింగ్ సౌకర్యం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
 
ఈ యాత్ర తొమ్మిది రాత్రులు, 10 పగళ్లలో కవర్ చేయబడుతుంది. ఇంకా ప్రయాణం, వసతి, క్యాటరింగ్, రైలులో భద్రత, అన్ని కోచ్‌లలో పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సౌకర్యం, ప్రయాణ బీమా, సహాయం కోసం ఐఆర్సీసీటీ టూర్ మేనేజర్లను కలిగి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు