కార్డుల చెల్లింపులపై వసూలు చేయాల్సిన అదనపు ఛార్జీలను డీలర్ల నుంచి వసూలు చేయాలని నిర్ణయించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. డీజిల్పై 2.5 శాతం, పెట్రోల్పై 3.2 శాతం చొప్పున డీలర్లకు కమిషన్ వస్తుందని.. అందులో నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు.
తమ లావాదేవీలపై ఒక శాతం వరకు మర్చంట్ డిస్కౌంట్ రేటును హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకులు డిమాండ్ చేస్తున్నాయని, ఇది తమకు అంగీకారయోగ్యం కాదని ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సాల్ తెలిపారు. ఏమైనా లావాదేవీల ఫీజు విధింపును ఈ నెల 13 వరకు వాయిదా వేయాలని బ్యాంకులు కూడా నిర్ణయించాయి.