ప్రైడ్ సెలబ్రేషన్స్‌తో ఎల్జిబిటిక్యు ప్లస్ కమ్యూనిటీని వేడుక చేసిన సింక్రోనీ

ఐవీఆర్

శనివారం, 29 జూన్ 2024 (17:27 IST)
ప్రముఖ వినియోగదారు ఆర్థిక సంస్థ అయిన సింక్రోనీ, తమ ప్రైడ్ ప్లస్ నెట్‌వర్క్ ఎంప్లాయీ రిసోర్స్ గ్రూప్ ద్వారా సంస్థ, విస్తృత హైదరాబాద్ కమ్యూనిటీలో ఇంక్లూజివిటి, అవగాహనను పెంపొందించే లక్ష్యంతో ప్రైడ్ మంత్ 2024ని జరుపుకుంది. సమానత్వం, వైవిధ్యత మరియు చేరికకు కంపెనీ యొక్క నిబద్ధత దాని రెండవ వార్షిక ప్రైడ్ మార్చ్, శక్తివంతమైన క్వీర్ ఫియస్టాను నిర్వహించడానికి మొబ్బెరా ఫౌండేషన్‌తో భాగస్వామ్యం ద్వారా ఉదహరించబడింది.
 
ఈ సంవత్సరం ప్రైడ్ మార్చ్ ఒక ఉత్సాహపూరితమైన కార్యక్రమంగా జరిగింది. ఇది ఉద్యోగులు తమదైన వ్యక్తిత్వంతో ఉండటానికి, LGBTQ+ చేరికను పెంపొందించడం, వైవిధ్యత దృశ్యాన్ని మార్చడం కోసం కంపెనీ యొక్క మద్దతును నొక్కిచెప్పింది. పరేడ్‌లో సింక్రోనీ ఉద్యోగులు, భాగస్వాములు గర్వంగా కనిపించారు. వారితో పాటు హైదరాబాద్‌లోని యు.ఎస్. కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, 350 మందికి పైగా మద్దతుదారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు, సానుకూల కార్యాలయ సంస్కృతి, సమగ్ర ఉద్యోగి ప్రయోజనాల ద్వారా వ్యక్తులను శక్తివంతం చేయడంలో వారి నిబద్ధతను గౌరవించారు.  ఈ కార్యక్రమం సంస్థ యొక్క విభిన్న ప్రతిభను పునరుద్ఘాటించటంతో పాటుగా, పాల్గొనేవారికి కనెక్ట్ అవ్వడానికి, నేర్చుకోవడానికి, వేడుక జరుపుకోవడానికి అవకాశాన్ని అందించింది.
 
“వరుసగా మేము నిర్వహించిన రెండవ ప్రైడ్ మార్చ్ కోసం చాలామంది ఉద్యోగులు, మా భాగస్వాములను చూసి నేను సంతోషించాను. వారి శక్తి స్ఫూర్తిదాయకం, ఇది నిజంగా సింక్రోనీ ఎంతగా సమ్మిలితతకు విలువనిస్తుందో చూపిస్తుంది. ప్రతి ఒక్కరూ తమంతట తాముగా సౌకర్యవంతమైన రీతిలో  ఉండేలా వర్క్‌ప్లేస్‌ని సృష్టించడం గురించి మేము ప్రయత్నాలను చేస్తున్నాము ” అని సింక్రోనీలో విపి, ప్రొడక్ట్ మేనేజర్, ప్రైడ్ ERG ఇండియా లీడ్  నిర్మల్ మాత్రేజా అన్నారు. "వైవిధ్యత, చేరికలు మమ్మల్ని ఒక గొప్ప కంపెనీగా చేశాయి. మేము ప్రతి వ్యక్తి యొక్క ప్రత్యేక ప్రతిభను వేడుక జరుపుకుంటున్నాము. ఉద్యోగి మొత్తం శ్రేయస్సు, ఉద్యోగులు -తొలుత అనే  అభ్యాసాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రగతిశీల సంస్థలో భాగమైనందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను ” అని అన్నారాయన.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు