దక్షిణాస్ట్రేలియా యూనివర్శిటీలో పరిశోధనా కేంద్రం

ఆస్ట్రేలియా ఉపప్రధాని జూలియా గిల్లార్డ్.. ముస్లిం, ముస్లిమేతరుల మధ్య పరస్పర అవగాహనకు అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. దక్షిణాస్ట్రేలియా యూనివర్శిటీలో ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ముస్లిం, ముసిమేతర సంస్కృతుల మధ్య స్పష్టమైన బేధాన్ని విపులీకరించేందుకు ఈ కేంద్రం పనిచేస్తుంది.

ఈ కేంద్రం ఏర్పాటు చేయడం కోసం.. ఆస్ట్రేలియా, దక్షిణాస్ట్రేలియా రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 10 మిలియన్ డాలర్లు సమకూర్చాయి. ఇటీవల భారత్‌లో పర్యటించిన నేపథ్యంలో.. ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించడం విశేషం. గిల్లార్డ్ ఆస్ట్రేలియా విద్య, ఉద్యోగ వంటి తదితర వ్యవహారాల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆస్ట్రేలియా-భారత్ శిక్షణ కేంద్రం కోసం గిల్లార్డ్ రూ. 32 కోట్లు నిధులను అందజేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అలాగే.. ఈ శిక్షణ సంస్థలో.. మెల్బోర్న్ యూనివర్శిటీ.. ఆస్ట్రేలియాలో దాని భాగస్వామ్య యూనివర్శిటీలు.. న్యూ సౌత్ వేల్స్ యూనివర్శిటీ, లా ట్రోబ్ యూనివర్శిటీలు సంయుక్తంగా.. రూ. 8 కోట్లు పెట్టుబడులు చేసేందుకు ముందుకు వచ్చాయి. మొత్తానికి మరో మూడేళ్లలో.. ఈ ప్రాజెక్టులో రూ. 40 కోట్లు మేరకు మొత్త పెట్టుబడులు తీసుకువచ్చేందుకు చూస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి