గుర్తింపు లేదంటూ బిట్స్ హైదరాబాద్‌కు యూజీసీ షాక్!

బుధవారం, 16 డిశెంబరు 2015 (11:45 IST)
బిట్స్ హైదరాబాద్ క్యాంపస్‌కు యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) గట్టి షాక్ ఇచ్చింది. అలాగే, హైదరాబాద్‌లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండింటితో పాటు.. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలకు గుర్తింపు లేదని తేల్చి చెప్పింది. అందువల్ల ఈ సెంటర్లను తక్షణం మూసివేయాలని సూచన చేసింది. 
 
ఈ పది విద్యా సంస్థలు యూజీపీ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై యూజీసీ డిప్యూటీ సెక్రటరీ సునితా సివాచ్ గత నెల పదో తేదీన మొత్తం పది సంస్థలకు నోటీసులు పంపించారు. ఇందులో తీసుకున్న చర్యల నివేదిక (ఏటీఆర్)ను సమర్పించాలని కోరారు. 

వెబ్దునియా పై చదవండి