కావలసిన పదార్థాలు : వరిపిండి... 300 గ్రా. బంగాళాదుంపలు... అర కేజీ నూనె... రెండు టీ. వెల్లుల్లి... రెండు రేకలు పచ్చిమిర్చి... రెండు పాలకూర... 300 గ్రా. కాలీఫ్లవర్... 150 గ్రా. ఉప్పు... తగినంత మిరియాలు.. అర టీ.
తయారీ విధానం : తరిగిన బంగాళాదుంపల్ని వరిపిండిలో వేసి మెత్తగా కలిపి పక్కన ఉంచాలి. బాణలి వేడిచేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. పాలకూర, కాలీఫ్లవర్, ఉప్పు, మిరియాలు వేసి ఉడికించాలి. పిండిముద్దని గుండ్రటి ముద్దలుగా చేసి ఒక్కో ముద్దనీ చిన్న పూరీలా వత్తి అందులో ఉడికించిన కూరని పెట్టి అంచులు మూసేసి కట్లెట్ని అరచేతితో చిన్నగా వత్తాలి.
ఇలా పిండి ముద్దనంతటినీ కట్లెట్లుగా చేసి, ఓ డిష్లో పెట్టి... మైక్రోవేవ్ ఓవెన్లో ఉంచి పదిహేను నిమిషాలపాటు సాధారణ ఉష్ణోగ్రతవద్ద ఉడికించాలి. ఉడికిన కట్లెట్లను అవసరమైతే కొద్దిగా నూనె వేసి, వేయించి ఏదేనీ కారంచట్నీతో కలిపి వడ్డిస్తే సరి...!!