తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్.. కేసులు సంగతేంటంటే..? (video)

మంగళవారం, 13 జులై 2021 (13:13 IST)
తెలంగాణలో కరోనా తీవ్రత రోజు రోజుకు తగ్గుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 65,607 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 465 కొత్త కేసులు వెలగుచూశాయి. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,31,683కు చేరింది. 
 
24 గంటల వ్యవధిలో నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,729కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 
 
తాజాగా 869 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,17,638కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,316 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి.
 
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 66,657 నమూనాల పరీక్షించగా, 1,578 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19, 24, 421కి చేరింది. తాజాగా 22 మంది కరోనా మహమ్మారికి బలవ్వడంతో మొత్తం మృతుల సంఖ్య 13,024కి పెరిగింది. 
 
ఈ మేరకు ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా 3,041 మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. చిత్తూరు, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు