తెలంగాణలో కరోనా.. దేశంలో 90వేల మార్కును తాకిన కోవిడ్ కేసులు

బుధవారం, 16 సెప్టెంబరు 2020 (11:20 IST)
తెలంగాణలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడంలేదు. గడిచిన 24 గంటల్లో 2,273 కరోనా కేసులు నమోదు కాగా 12 మంది మృత్యువాత పడ్డారు. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1,61,844కు చేరుకోగా.. 956 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 30,401 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 1,31,447 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటి వరకు 21.69 లక్షల మందికి అధికారులు కరోనా టెస్టులు నిర్వహించారు. 
 
ఇక దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొన్ని రోజుల నుంచి రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలో నమోదైన కేసులు అరకోటి దాటాయి. 
 
అయితే.. గత 24 గంటల్లో కొత్తగా.. 90,123 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా మంగళవారం 1,290 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50,20,360కి పెరగగా.. మరణాల సంఖ్య 82,066కి చేరింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు