ఆయన తరపున లాయర్ వచ్చాడు. హైడ్రా కమీషనర్ చర్చ పెట్టినప్పుడు లాయర్ చెప్పినవన్నీ అబద్దాలే. ఇంక దేశంలో న్యాయం ఎందుకు జరగడంలేదో నాకు అర్థమయింది. ఆ తర్వాత హైడ్రా కమీషనర్ కొలతలువేసి మార్క్ పెట్టారు. వాటిని చూసి తిరిగి వస్తుండగా ఇద్దరు బైక్ పై కత్తులతో నాపై, నా సోదరుడు రమేష్ ప్రకాష్ పై దాడిచేశారని ఆ టైంలో నేనూ పక్కనే వున్నాను. మరో వ్యక్తి కారుతో నన్ను యాక్సిడెంట్ చేశారు. త్రుటిలో తప్పుకున్నా. కాగా, దాడిచేసి వారిలో కారులో వున్నవాడు మాతోపాటు గతంలో స్థలం తీసుకుని మా బాధితుడుగా యాక్ట్ చేశాడు. ఇదంతా సినిమాలో జరిగినట్లుగా ప్లాన్ ప్రకారం జరిగింది. ఈ దేశంలో సామాన్యులకు న్యాయం జరగదా అంటూ ఓ యూట్యూబ్ చానల్ లో ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం మా సోదరుడు ఆసుప్రతిలో వున్నాడు. అప్పుడు పోలీసులు వచ్చారు.
ఆ తర్వాత పోలీసు స్టేషన్ లో కేసుపెట్టడండని కానిస్టేబుల్ కోరిక మేరకు ఎస్.ఐ.శ్రీనాథ్ కి విన్నవించాను. పోలీసులు కూడా నేను చెప్పింది కరెక్టే అంటూ ఎస్.ఐ.కి చెప్పారు.ఆ తర్వాత వారిని వెళ్లిపోమని, మాతో చాలా కేర్ లెస్ గా మాట్లాడారు. దాంతో మాకు న్యాయం జరగదని తేలిపోయింది. పోలీసు డిపార్ట్ మెంట్ ను కూడా అతను కొనేశాడు. ప్రజాస్వామ్యంలో న్యాయం జరగదు అని అర్థం అయింది. ఇలాంటి వారికి నయూమ్ కు వేసిన శిక్షను వేయాలంటూ కఠినంగా చెప్పింది. మరి తెలంగాణ ప్రభుత్వం వీరికి న్యాయం చేస్తుందో లేదో చూడాలి.