దేశంలో విజృంభిస్తోన్న కరోనా.. 8,329 మందికి పాజిటివ్

శనివారం, 11 జూన్ 2022 (13:25 IST)
కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తోంది. జూన్ ఆరంభం నుంచి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. జూన్ లేదా జులై నెలాఖరుకు కరోనా నాలుగో వేవ్ రావొచ్చంటూ అంచనా. 
 
తాజాగా శుక్రవారం దేశవ్యాప్తంగా 3.44 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. 8,329 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 2.41 శాతంగా ఉంది. అదే సమయంలో ఈ మహమ్మారి నుంచి 4,216 మంది కోలుకున్నారు. ఇక ఈ వైరస్ కు 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో శుక్రవారం 3,081 మంది కరోనా బారిన పడితే, అందులో ముంబైలోనే 1,956 కేసులు వచ్చాయి. కేరళలో 2,415 కేసులు, ఢిల్లీలో 655 కేసులు వచ్చాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు