వామ్మో... ఏపీలో దుమ్ముదులుపుతున్న కరోనా వైరస్

గురువారం, 20 జనవరి 2022 (18:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దుమ్ముదులుపుతుంది. కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా మరో 12615 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధితంగా చిత్తూరు జిల్లాలోనే 2338 కరోనా కేసులు వెలుగుచూశాయి. 
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన మేరకు గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 12338 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో అత్యల్పంగా 216 కేసులు వెస్ట్ గోదావరి జిల్లాలో నమోదయ్యాయి. 
 
అలాగే, ఈ కరోనా వైరస్ కారణంగా నలుగురు మృతి చెందగా మరో 3674 మంది కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 21,40,056కు చేరింది. అలాగే, 20,71,658 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 14527 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 53871 యాక్టివ్ కేసులు ఉండగా, వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు