తెలుగు రాష్ట్రాలను వణికిస్తోన్న బ్లాక్ ఫంగస్.. నిండిపోతున్న ఆస్పత్రులు

బుధవారం, 26 మే 2021 (12:28 IST)
Black fungus
తెలుగు రాష్ట్రాలను బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్క తెలంగాణాలోనే బ్లాక్ ఫంగస్ కేసులు 1000 నమోదయ్యాయి. ఈ ఫంగస్‌తో బాధపడే బాదితులు హైదరాబాద్‌లోని కోఠిలో ఉన్న ఈఎన్‌టీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు పెగుతుండటంతో ఈ ఆసుపత్రికి వచ్చే బాధితుల సంఖ్య పోరుగుతోంది. దీంతో ఆసుపత్రిలో బెడ్స్ మొత్తం ఫుల్ అయ్యిపోయాయి.
 
రోజు రోజుకు ఈ కేసులు పెరుగుతుండటంతో మసాబ్ ట్యాంక్ ప్రాంతంలో ఉన్న సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో కూడా బ్లాక్ ఫంగస్ బాదితులకు చికిత్స అందిస్తున్నారు. సరోజిని కంటి ఆసుపత్రిలో అదనంగా 200ల బెడ్స్ ఏర్పాటు చేసి బాధితులకు చికిత్సనందిస్తున్నారు డాక్టర్లు. అలాగే గాంధీ ఆసుపత్రిలో కూడా బ్లాక్ ఫంగస్ బాదితులు రావటంతో అక్కడ 50 బెడ్స్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తుననారు.
 
ఈ క్రమంలో ఫంగస్ బాధతులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 1500ల బెడ్స్ పెంపుకు రంగం సిద్ధం చేసింది. ఏడు మెడికల్ కాలేజీల్లో ట్రీట్ మెంట్ అందించే చర్యలుతీసుకుంది ప్రభుత్వం. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాక నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు