త్వరలోనే కరోనా రహిత దేశంగా భారత్...?

మంగళవారం, 27 అక్టోబరు 2020 (11:10 IST)
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నాయి. తాజాగా కరోనా కేసుల సంఖ్యపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 36,469 మందికి కరోనా నిర్ధారణ అయిందని పేర్కొంది. అదేసమయంలో 63,842 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,46,429కి చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 488 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,19,502 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 72,01,070 మంది కోలుకున్నారు. 6,25,857 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 10,44,20,894 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,58,116 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు, తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 837 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,554 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,32,671 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,13,466 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,315 కి చేరింది. ప్రస్తుతం 17,890 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వారిలో 14,851 మంది హోంక్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 185 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 59 కేసులు నిర్ధారణ అయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు