దేశంలో కొత్తగా మరో 34 వేల కరోనా పాజిటివ్ కేసులు

శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (10:36 IST)
దేశంలో కొత్తగా మరో 34 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 34,973 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపింది. ఈ కేసులతో కలుపుకుంటే క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,31,74,954కి చేరింది. 
 
అలాగే, నిన్న 37,681 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 260 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,42,009కి పెరిగింది. ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,23,42,299 మంది కోలుకున్నారు. 3,90,646 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. 
 
అదేసమయంలో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 72,37,84,586 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. మరోపక్క, నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 26,200 కొత్త కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో నిన్న 114 మంది ప్రాణాలు కోల్పోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు