అనిల్ కుంబ్లే టీమ్ ఇండియా ప్రధాన కోచ్... అనురాగ్ ఠాకూర్

గురువారం, 23 జూన్ 2016 (19:38 IST)
టీమ్ ఇండియా ప్రధాన కోచ్ పోస్ట్. 57 దరఖాస్తులు... వాటిలో వాటిలో మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, కుంబ్లే, సందీప్ పాటిల్, వెంకటేశ్ ప్రసాదులు కూడా ఉన్నారు. ఐతే ఎట్టకేలకు ఈ పోస్టుకి అనిల్ కుంబ్లేను ఎంపిక చేశారు. టీమిండియా ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లేను నియమించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ గురువారం నాడు చెప్పారు.
 
ఈ సాయంత్రం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో కోచ్ ఎంపికపై చర్చలు జరిగాయి. ఆ సమావేశం ముగిసిన అనంతరం ఆయన కుంబ్లే పేరును ప్రకటించారు. అనిల్ కుంబ్లే ఏడాదిపాటు కోచ్ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ పదవి కోసం గట్టి పోటీ ఏర్పడింది. 57 మంది నుంచి వచ్చిన దరఖాస్తులలో చిట్టచివరికి అనిల్ కుంబ్లేను ఎంపిక చేశారు.

వెబ్దునియా పై చదవండి