టీమిండియాకు ఐసీసీ అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఈ కారణంగానే ధోనీ సేన వరుస విజయాలను సాధిస్తోందని అతడు వ్యాఖ్యానించాడు. ‘ఇప్పటిదాకా భారత్ ఆడిన మ్యాచ్లు చూడండి. ఆ జట్టుకు అనువైన పిచ్లను తయారుచేయడంలో ఐసీసీ ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికైనా పాక్ క్రికెట్ బోర్డు మేల్కోవాలి. ఐసీసీ వద్ద ఈ విషయాన్ని లేవనెత్తి, జరుగుతున్న తంతు ఏమిటో నిగ్గు తేల్చాలి’ అని అతడు ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా పేర్కొన్నాడు.