దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

ఠాగూర్

ఆదివారం, 19 మే 2024 (16:55 IST)
దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. మరికొన్ని రోజుల్లో నైరుతి రుతుపవనాలు భారత ప్రధాన భూభాగంలోని ప్రవేశించనున్నాయి. దేశంలో అత్యధిక వర్షపాతం అందించే ఈ రుతుపవనాల కదలికలపై భారత వాతావరణ శాఖ తాజా సమాచారం అందించింది. 
 
నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలోని కొన్ని భాగాల్ల విస్తరించాయని, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోనూ ప్రవేశించాయని ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ముందుకు కదలడానికి అనుకూల పరిస్థితులు నెలకొనివున్నాయని వివరించింది. 
 
ఇక మే 22వ తేదీన నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఇది వాయువ్య దిశగా పయనించి మే 24వ తేదీ నాటికి బంగాళాఖాతంలో వాయుగుండం మారుతుందని ఐఎండీ పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు