అరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ.. బ్రాడ్‌మన్‌ను అధికమిస్తారా?

మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (16:45 IST)
భారత పరుగుల యత్నం విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును బ్రేక్ చేసేందుకు కన్నేశాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు సారథిగానేకాకుండా ఓ బ్యాట్స్‌మెన్‌గా కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటికే టెస్టులు, వన్డే, టీ20ల్లో కలిపి 870 పరుగులు చేశాడు. వీటిలో నాలుగు సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ఒకటి, వన్డేల్లో మూడు సెంచరీలు చేశాడు. 
 
అయితే, ఈ పర్యటనలో భారత్ మరో రెండు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు మ్యాచ్‌లలో కలిపి 130 పరుగులు చేస్తే చాలు.. కోహ్లీ సరికొత్త రికార్డును నెలకొల్పినట్టే. అయితే, ఆ రికార్డు ఆషామాషీది కాదు.. పైగా, ఈ ఆధునిక కాలంలో నమోదైన రికార్డు అంతకన్నా కాదు. కొన్ని దశాబ్దాల క్రితం నమోదైన రికార్డు.
 
ఒక క్రికెటర్ విదేశీ గడ్డపై ఓ సిరీస్‌లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన అరుదైన రికార్డు విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్, సర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది. గత 1976లో ఇంగ్లండ్‌పై రిచర్డ్స్ 1,045 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఇప్పటివరకు మరే ఆటగాడు ఆ దరిదాపులకు కూడా చేరుకోలేక పోయారు. 
 
ఆ తర్వాత ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ సర్ డాన్ బ్రాడ్‌మన్ ఉన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో బ్రాడ్‌మన్ 974 పరుగులు చేయగా, ఆ తర్వాత 1976లో రిచర్డ్స్ 1000 పరుగులు చేసి బ్రాడ్‌మన్ రికార్డును సవరించాడు. అప్పటినుంచి ఈ రికార్డు ఎంతో పదిలంగా ఉంది. ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు విరాట్ కోహ్లీ చేరువగా వచ్చాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు