కాగా, ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకున్న భారత క్రికెట్ జట్టు తన తొలి ఇన్నింగ్స్లోనే 8 వికెట్ల నష్టానికి 566 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఈ భారీ ఇన్నింగ్స్లో జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి డబుల్ సెంచరీతో విరుచుకుపడగా, స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా సెంచరీతో రాణించాడు.