ధోనీ కోసం 77 అడుగుల భారీ కటౌట్..

గురువారం, 6 జులై 2023 (20:40 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కోసం ఆయన అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ కటౌట్ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
 
ధోనీ 44వ జన్మదినాన్ని పురస్కరించుకొని 77 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో ఇప్పటికే 52 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశామన్నాడు.
 
నందిగామలో 77 అడుగులు పెట్టామని ఓ అభిమాని వెల్లడించాడు. తాము ధోనీపై అభిమానంతో ఇదంతా చేస్తున్నట్లు తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు