అవహేళన చేసిన అభిమానిపై పాక్ క్రికెటర్ దాడి.. వీడియో వైరల్

మంగళవారం, 6 డిశెంబరు 2022 (16:28 IST)
Hasan Ali
2021 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో ఓడిపోయామని అవహేళన చేసిన అభిమానిపై పాకిస్థాన్ క్రికెటర్ దాడి చేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. హసన్ అలీ పాకిస్థాన్ క్రికెట్ జట్టులోని ప్రముఖ ఆటగాళ్లలో ఒకరు. 
 
2021 టీ20 ప్రపంచకప్ తర్వాత మరే ఇతర టోర్నీలోనూ అతనికి చోటు దక్కలేదు. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ వేడ్‌తో జరిగిన ఆ ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో కూడా హసల్ అలీ తన కీలక క్యాచ్‌లలో ఒకదాన్ని కోల్పోయాడు. దీంతో ఆస్ట్రేలియా గెలిచి ఫైనల్‌కు చేరుకుంది.. అంటూ హసన్ అలీని అభిమానులు ఆటపట్టించారు. 
 
హసన్ అలీ ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో జరిగిన స్థానిక క్రికెట్ ట్రోఫీ టీ20 టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. అప్పుడు మాథ్యూ వేడ్‌ క్యాచ్‌ను మిస్‌ అయ్యాడని కొందరు ప్రేక్షకులు హసన్‌ అలీని ఆటపట్టించారు. 
 
మైదానంలో ఉండగానే ఓపికగా ఆడి, మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రేక్షక గోపురం గుండా వెళుతుండగా అంతకుముందు తనను ఆటపట్టించిన అభిమానిని కాలితో తన్నడం పాటు దాడి చేశాడు. దీనికి ప్రతిగా అభిమానులు హసన్ అలీపై దాడికి యత్నించడంతో అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

❗️Report:
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు