నిజానికి ఈ విడిపోవడంపై అనుష్క కానీ విరాట్ కానీ ఏనాడూ స్పందించలేదు. కాకపోతే గత రెండు నెలలుగా ఈ క్రికెటర్ ఫుల్లు బిజీ. ఆసియా కప్ - వరల్డ్ టీ20 సిరీస్ తోనే సరిపోయింది. ఇప్పుడు కూడా ఐపీఎల్కి సిద్ధమైపోయాడు. ఈలోగా తన ప్రియురాలితో కలిసి సరదాగా డిన్నర్ చేశాడు. ముంబైలోని ఓ పోష్ రెస్టారెంట్లో వీరిద్దరూ డిన్నర్ చేస్తూ కనిపించారు. నిజానికి వీరిద్దరూ కలిసి రాలేదు. ఎవరి కార్లలో వాళ్లే రెస్టారెంట్కి వచ్చారు. తిరిగి వెళ్లేటప్పుడు జరిగిన సంఘటనే.. వీళ్ల మధ్య బేధాభిప్రాయాలు లేవని తేల్చేసింది.