విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ బ్రేకప్ వార్తల్లో నిజం లేదా? ఓ హాట్ హగ్ ఇచ్చి?

గురువారం, 7 ఏప్రియల్ 2016 (15:11 IST)
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ - బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు బ్రేకప్ తీసుకున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. బ్రేకప్ తర్వాత వాలెంటైన్ డే కూడా ఈ జంట జరుపుకోకపోవడం ఈ వార్తలకు ఊతమిచ్చింది. అయితే.. ఇప్పుడు జరిగిన ఓ సంఘటన ఈ బ్రేకప్ వార్తలన్నీ ఉత్తుత్తివే అని తేల్చేసింది. 
 
నిజానికి ఈ విడిపోవడంపై అనుష్క కానీ విరాట్ కానీ ఏనాడూ స్పందించలేదు. కాకపోతే గత రెండు నెలలుగా ఈ క్రికెటర్ ఫుల్లు బిజీ. ఆసియా కప్ - వరల్డ్ టీ20 సిరీస్ ‌తోనే సరిపోయింది. ఇప్పుడు కూడా ఐపీఎల్‌కి సిద్ధమైపోయాడు. ఈలోగా తన ప్రియురాలితో కలిసి సరదాగా డిన్నర్ చేశాడు. ముంబైలోని ఓ పోష్ రెస్టారెంట్‌లో వీరిద్దరూ డిన్నర్ చేస్తూ కనిపించారు. నిజానికి వీరిద్దరూ కలిసి రాలేదు. ఎవరి కార్లలో వాళ్లే రెస్టారెంట్‌కి వచ్చారు. తిరిగి వెళ్లేటప్పుడు జరిగిన సంఘటనే.. వీళ్ల మధ్య బేధాభిప్రాయాలు లేవని తేల్చేసింది.
 
డిన్నర్ అయిపోయాక.. అనుష్కను పంపించేందుకు ఆమె కార్ వరకూ వచ్చాడు విరాట్ కోహ్లీ. ఒకట్రెండు నిమిషాలు మాట్లాడాక.. ఓ హాట్ హగ్ ఇచ్చి సెండాఫ్ చెప్పడంతో.. అనుష్కతో బ్రేకప్ లాంటివేమీ లేవని తేలిపోయింది. సో కోహ్లీ అనుష్కల మధ్య బ్రేకప్ వార్తలు నిజం కావని తేలిపోయిందన్నమాట.

వెబ్దునియా పై చదవండి