ఇంగ్లండ్‌తో జరిగే తొలి వన్డేనే జయసూర్యకు ఆఖరి మ్యాచ్!

ఇంగ్లండ్‌తో జరిగే తొలి వన్డే మ్యాచే శ్రీలంక వెటరన్ బ్యాట్స్‌మెన్ సనత్ జయసూర్యకు చివరి మ్యాచ్ కానుంది. ఈ నెల 28న ఇంగ్లండ్‌తో జరిగే తొలి వన్డేతో సనత్ జయసూర్య రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు.

శ్రీలంక జట్టులో చోటు కోసం ఏడాదికాలంగా ఎదురుచూసిన జయసూర్యకు ఇంగ్లండ్‌లో పర్యటించే 16 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. దీంతో క్రికెట్ నుంచి గౌరవంగా తప్పుకోవాలని జయసూర్య అనుకుంటున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్‌తో జరిగే తొలి వన్డేతో రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

సనత్ జయసూర్య 2007లోనే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీలంక జట్టు ఇంగ్లండ్‌తో ఏకైక టి-20తోపాటు ఐదు వన్డేల సిరీస్, తర్వాత ఐర్లాండ్, స్కాట్లాండ్‌లతో ఒక్కో వన్డే ఆడుతుంది. ప్రస్తుతం శ్రీలంక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న జయసూర్య ఈ నెల 30న 42వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాడు.

వెబ్దునియా పై చదవండి