పాకిస్థాన్‌ను నమ్మడం ఒక జోక్: గౌతం గంభీర్ కామెంట్

FILE
పాకిస్థాన్‌ను నమ్మడం ఒక జోక్‌గా భారత క్రికెటర్ గౌతం గంభీర్ అభివర్ణించాడు. సరిహద్దుల్లో ఐదుగురు భారత జవాన్లను పాక్ సైనికులు కాల్చి చంపడం పట్ల గంభీర్ ఘాటుగానే స్పందించాడు.

'సరిహద్దుల్లో పాకిస్థాన్ ఈ ఏడాది 57 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని న్యూస్ పేపర్లలో చూశాను. అయినా మనం వారిని(పాక్) నమ్మాలి! ఇట్సే జోక్' అంటూ గౌతం గంభీర్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

కాగా జమ్మూ కాశ్మీర్‌లోని ఫూంచ్ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద భారత జవాన్లపై కాల్పుల ఘటనకు సంబంధించి పార్లమెంటులో రక్షణ మంత్ర ఏకే ఆంటోనీ చేసిన ప్ర్టకటనకు వెంటనే క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండు చేసింది.

వెబ్దునియా పై చదవండి