ఇటీవల క్రికెట్ బంతి బౌన్సర్ తగిలి మృత్యువాత పడిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతికి సంతాపంగా అతను వాడిన క్రికెట్ బ్యాటును ఎవరెస్ట్ శిఖరంపై ఉంచేందుకు నేపాల్ క్రికెట్ సంఘం ముందుకు వచ్చింది. ఇదే విషంపై క్రికెట్ ఆస్ట్రేలియాకు ఒక లేఖ కూడా రాసింది. ఇందుకోసం హ్యూస్ తన చివరి మ్యాచ్లో వాడిన బ్యాట్ ఇవ్వాలని కోరింది.
హ్యూస్కు నివాళిగా అతను వాడిన బ్యాటును ఎవరెస్టు శిఖరం మీద ఉంచుతామంటూ క్రికెట్ ఆస్ట్రేలియాకు నేపాల్ క్రికెట్ సంఘం ఓ లేఖ రాయగా, దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా సానుకూలంగా స్పందించింది. కాగా, హ్యూస్ బ్యాట్ను శిఖరాగ్రానికి చేర్చేందుకు నేపాల్ క్రీడాకారులతో, పర్వతారోహకులతో చర్చలు జరుపుతున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్ వ్యాలీ ఎడ్వర్డ్స్ తెలిపారు. వచ్చే సీజన్లో బ్యాట్ను ఎవరెస్ట్ చేరుస్తామని ఆయన అన్నారు.