అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న అత్తను చంపేసిన కోడలు.. ఎక్కడ?

శుక్రవారం, 20 అక్టోబరు 2023 (20:15 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉండటంతో అత్తను కోడలు చంపేసింది. ఆమె ప్రియుడు కూడా ఈ హత్యకు తన వంతు సహకారం అందించారు. ఇది కర్నాటకలోని బెంగుళూరు నగరానికి సమీపంలోని బద్దరహళ్లి అనే ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ బద్దరహళ్లి ప్రాంతానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తి భార్య రష్మీ, తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన మంజునాథ్ తల్లి ఆకస్మికంగా మృతి చెందారు. అయితే, ఆమె గుండెపోటుతో చనిపోయివుంటారని అందరూ భావించారు. కానీ, తన తల్లి మృతిపై మంజునాథ్‌కు ఎక్కడో సందేహం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఇందులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
మంజునాథ్ ఇంటిపై అద్దెకు ఉండే అక్షయ్ అనే యువకుడితో రష్మీకి ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అక్షయ్‌కు అవసరమైనపుడల్లా రష్మీ డబ్బులు ఇస్తూ తన గుప్పెట్లో పెట్టుకుంది. ఈ విషయం మంజునాథ్ తల్లికి తెలియడంతో ఆమె కోడలు రష్మిని హెచ్చరించింది. ప్రవర్తన మార్చుకోకపోతే తన కుమారుడికి చెబుతునని బెదిరించింది. దీంతో తన ప్రియుడు అక్షయ్‌తో కలిసి అత్తను చంపేందుకు ప్లాన్ వేశాం. ఆహారంలో అధిక మోతాదులో నిద్రమాత్రుల కలిపి, గొంతు నులిమి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో రక్ష్మీతో పాటు.. అక్షయ్ వెల్లడించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు